
హైదరాబాద్ లక్డీకాపూల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
విభిన్న రాజకీయ పదవులు చేపట్టి తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన రోశయ్య స్మరణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.