
కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై ఆర్టీయే కేసులు నమోదు
ఏలూరు
ఏలూరు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పడి కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే వాణిజ్య వాహనాలపై త్రైమాసిక పన్ను చెల్లించకుండా, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని తదితర క్రమరాహిత్యాలపై కేసులు నమోదు చెలినట్లు అయన తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఇంచార్జ్ ఆర్టీవో ఎస్. రంగనాయకులు, వాహన తనిఖీ అధికారులు జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, డి.ప్రజ్ఞ పాల్గొన్నారు.