
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టోక్యో (Tokyo) తర్వాత రెండవ సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది తెలంగాణ, భారతదేశ డిజిటల్ భద్రతను పెంపొందించడంతోపాటు, వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ ప్రాజెక్ట్ను హైదరాబాద్కు తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. రేవంత్ రెడ్డి గూగుల్తో ఈ భాగస్వామ్యం తెలంగాణ యువతకు, ఇంజనీర్లకు, భద్రతా నిపుణులకు విశేష అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.సైబర్ భద్రత, ఆన్లైన్ సెక్యూరిటీ: ఈ కేంద్రం సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఇది భారతదేశం, తెలంగాణకు అవసరమైన సైబర్ భద్రతా సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్గా మార్చడంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది.ఈ కేంద్రం వల్ల యువతకు, ఇంజనీర్లకు, భద్రతా నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ భద్రత, సాంకేతిక వికాసం, ఇన్నోవేషన్లను పెంపొందిస్తుంది. గూగుల్తో భాగస్వామ్యం వల్ల తెలంగాణకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెట్ ఎక్స్పోజర్ లభిస్తుంది గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాం. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెడుతుంది. ఉపాధిని సృష్టించడం తో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం ..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను. ఇదే తెలంగాణ రైజింగ్ గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నాను. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుంది. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము. 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాం. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశా మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం. మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్న. గూగుల్ , హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాం. గూగుల్ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను నియమించాం. GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్జెండర్లను నియమిస్తుంది. నాణ్యమైన విద్య మా లక్ష్యం.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు.. గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని నమ్మకం ఉందన్నారు’ సీఎం రేవంత్ రెడ్డి.