
బాల్యాన్ని పాఠశాలకే పరిమితం చేయాలి: గోవింద రావు పిలుపు
విజయనగరం,
“ప్రతి ఒక్క పిల్లవాడు బడికి వెళ్లాలి… నిరక్షరాస్యతను జెరిపివేయాలి” అని ప్రజా సంకల్ప వేదిక చైతన్య కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాముద్రి గోవింద రావు ప్రజలకు సూచించారు.
బాల కార్మిక చట్టం కేవలం దినోత్సవాలకే పరిమితమైపోకుండా, ప్రతి ఇంట్లో పిల్లల గురించి సర్వే చేసి వారిని బడికి పంపించేలా ప్రభుత్వాలు, అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి సహకరించాలని సూచించారు.
14 సంవత్సరాల లోపు పిల్లలను పని చేయించడాన్ని అణచివేస్తేనే వారికి నిజమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. బాల కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన దినోత్సవమని గోవింద రావు స్పష్టం చేశారు.