
హైదరాబాద్ – స్టైల్ తత్వ 5వ ఎడిషన్ను ప్రకటించిన ఎఫ్ఎల్ఓ జూన్ 13–14 తేదీలలోలైఫ్స్టైల్ ఎగ్జిబిషన్ స్టైల్ కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మద్దతుతో ప్రదర్షన హైదరాబాద్, జూన్ 10 ; ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించే సిగ్నేచర్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఎగ్జిబిషన్ స్టైల్ తత్వ ఐదవ ఎడిషన్ జూన్ 13–14 తేదీలలో ….. హాల్ 2లో నిర్వహించనున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది.ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా 205 ప్రదర్శకులు పాల్గొంటున్నారు. ఫ్యాషన్, డెకర్, హ్యాండ్లూమ్, ఆభరణాలు, హోమ్ లివింగ్, కళాత్మక ఉత్పత్తులు లాంటి విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. 10,000 మందికిపైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. అధికారిక వాట్సాప్ క్రియేటివ్ చూపిన వారికి ప్రవేశం ఉచితం. లేకపోతే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జూన్ 13 ఉదయం 10:30 గంటలకు హైదరాబాదు మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరుగుతుంది. గెస్ట్ ఆఫ్ హానర్గా ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పూనమ్ శర్మ మరియు సెలబ్రిటీ డ్రేపింగ్ ఆర్టిస్ట్ డాలీ జైన్ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.మీడియా సమావేశానికి ఫెమినా మిస్ ఇండియా 2023, మిస్ వరల్డ్ టాప్ 20 ఫైనలిస్ట్ నందిని గుప్తా గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, “ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్లా, ఇది కూడా బ్రెయిన్తో కూడిన బ్యూటీ ప్రదర్శన. మహిళలు నిర్వహించే, ఉద్దేశంతో కూడిన ఈ ప్రదర్శన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది,” అని చెప్పారు.