
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్లపూడి నుంచి విధులకు వస్తున్న ఇద్దరు ఎంప్లాయిస్ను, కోకో వైన్స్ దిశ నుంచి వస్తున్న సీఐఎస్ఎఫ్ వాహనం డబుల్ ఆర్ ఎం బస్టాప్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తక్షణమే స్టీల్ ప్లాంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.