
యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
విశాఖపట్నం
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21న విశాఖ బీచ్రోడ్డులో నిర్వహిం చనున్న కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మందిని సమీకరించాల ని భావిస్తోంది. ఈ మేరకు మంత్రు లు, ఉన్నతాధికారులు నగరంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్ష లు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీచ్రోడ్డులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే పచ్చటి మ్యాట్లు వేయడం ప్రారంభించారు. కొన్ని చోట్ల ఇరువైపులా, మరికొన్నిచోట్ల ఒక వైపు మ్యాట్లు వేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్రోడ్డు పొడవునా 268 కంపార్టుమెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి కంపార్టుమెంటులో ఒక వేదిక నిర్మించారు. కంపార్టుమెంటులో ఉండే వారితో వేదికపైనుండే శిక్షకుడు యోగాసనాలు వేయిస్తారు.