
తెలంగాణ స్పీకర్ ను కలిసిన యూపీ స్పీకర్
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా గురువారం నాడు మర్యాద పూర్వకంగా కలిసారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సతీష్ మహానా దంపతులు బంజారాహిల్స్, మంత్రుల నివాసంలోని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అధికార నివాసానికి విచ్చేసారు. తన నివాసానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ స్పీకర్ దంపతులను స్పీకర్ ప్రసాద్ కుమార్ శాలువా, పుష్ప గుచ్ఛంతో సన్మానించి మెమొంటో బహుకరించారు. ఈసందర్భంగా తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వాహణపై ఇరువురు స్పీకర్లు ముచ్చటించారు.