
విమాన ప్రమాదంలో 242 మంది మృతి
అహ్మదాబాద్
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు.