ఘోర రోడ్డు ప్రమాదం… కారు నిలిపి భోజనం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ… ఇద్దరు మృతి…

మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌ను శామీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Two killed after speeding lorry rams car near Shamirpet

శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. మౌలాలి RTC కాలనీకి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ (51), షేక్‌పేట్‌కు చెందిన మొహమ్మద్ హుస్సేన్ (48) TS 09 ED 3303 నంబర్ గల ఆడి కారులో ECIL నుండి తూప్రాన్ వైపు ఔటర్ రింగ్ రోడ్ (ORR) మార్గంలో ప్రయాణిస్తున్నారు.


మార్గమధ్యంలో శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భోజనం చేయడానికి వారు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి ఉండగా, MH 12 PQ 2337 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే షామీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.

లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద (హత్యకు సమానంకాని మానవహత్య) కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Police said the victims had stopped their vehicle to have food when the accident occurred. The speeding Ashok Leyland truck reportedly rammed into them, causing fatal injuries on the spot.

On receiving information, Shamirpet police shifted the bodies to Gandhi Hospital for post-mortem and began investigation. The truck driver was taken into custody and tested for drunk driving, which confirmed alcohol consumption.

Police registered a case under Section 105 of the Bharatiya Nyaya Sanhita (culpable homicide not amounting to murder) and further investigation is underway.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *