
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి | హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే | సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరు
హైదరాబాద్ :
హైదరాబాద్ హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ పోటీలో థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత చువాంశ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఈ గ్రాండ్ ఈవెంట్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకకు మరింత ఆకర్షణగా నిలిచారు.
2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా, నూతన మిస్ వరల్డ్కు కిరీటాన్ని సమర్పించగా, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఆమెను అధికారికంగా ప్రకటించారు. ఈ పోటీలకు జడ్జీలుగా సోనూ సూద్, రానా దగ్గుబాటి, నమ్రత శిరోద్కర్, జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి తదితరులు వ్యవహరించారు.
📌 రన్నరప్లు
▪️ ఫస్ట్ రన్నరప్ – మిస్ ఇథియోపియా
▪️ సెకండ్ రన్నరప్ – మిస్ పోలాండ్
▪️ థర్డ్ రన్నరప్ – మిస్ మార్టినిక్

భారతదేశం తరఫున నందిని గుప్తా పోటీ పడగా, పోటీదారులు సుమారు 20 రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి “తెలంగాణ జరూర్ ఆనా” నినాదాన్ని విశ్వవ్యాప్తంగా పాపులర్ చేశారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిన ఈ కార్యక్రమానికి సీఎం, సినీ ప్రముఖుల హాజరు విశేషంగా నిలిచింది.
