Harish Rao Inspires Youth at Siddipet Youth Meet: Calls for Purposeful Life ; for Telugu News and English News kindly Scroll Down.

సిద్ధిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు స్పూర్తిదాయక ప్రసంగం
సిద్ధిపేట | జూన్ 14:
సిద్ధిపేటలో శుక్రవారం నిర్వహించిన యువ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని యువతతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు.
“మీరు నేను ఒక కుటుంబం… మి పటిమ, పట్టుదల నా గుండె లోతుల్లో నిలిచిపోతాయి” అంటూ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ:
“సిద్ధిపేటలో పుట్టిన గులాబీ జెండా రజతోత్సవం జరుపుకుంది. ఇందుకోసం సిద్ధిపేట నుండి వరంగల్ వరకు పాదయాత్రగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు చేసిన త్యాగం అప్రతిమం.”
అనంతరం యువతకు కీలక సూచనలు చేశారు:
- యువత వ్యసనాలకు బానిసకావొద్దు, తల్లిదండ్రులకు అండగా ఉండండి.
- 25-50 ఏళ్ల మధ్య జీవితం దిశను మార్చే కాలం. ప్రతి నిమిషం విలువైనది.
- ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వీటికి దూరంగా ఉండాలి.
- పనిలో చిన్నదేమీ ఉండదు. మొదట స్థిరపడాలి. తర్వాత ఎదగాలి.
- మద్యం, డ్రగ్స్కు తావు ఉండకూడదు. నా బృందంలో అటువంటి వ్యక్తులకు స్థానం లేదు.
- “మీలో ప్రతి ఒక్కరు నాయకుడిగా ఎదగాలి. మీ కోసం నా వంతుగా నేను చేయవలసినదాన్ని చేస్తాను.”
ఇకపోతే కాంగ్రెస్ పాలనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు:
“ఇంకో మూడు సంవత్సరాల్లో మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఈ ప్రభుత్వం రైతులను, ఉద్యోగులను, యువతను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.”
“ఏ స్కీం అమలుకాకపోవడం, ప్రజలకు పాలా నీళ్లా తేడా అర్థమైపోయింది. ప్రజలే ఇప్పుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.
Harish Rao at Siddipet Youth Meet: A Stirring Message to Telangana Youth
Siddipet | June 14:
At a youth gathering in Siddipet, former minister and MLA Harish Rao delivered a stirring address, emphasizing discipline, life goals, and staying away from addictions.
He lauded the dedication of those who marched from Siddipet to Warangal for the BRS Silver Jubilee and called the youth his extended family.
He urged youth to avoid online gaming, alcohol, and drugs, focus on settling in life, and remember the importance of every moment in the 25–50 age range.
Harish Rao also criticized the current Congress government, alleging total failure in implementing schemes and betraying every section of society.