జీవితం అంతా డిజిటల్‌తో ముడి… డిజిటల్ సేఫ్టీ కీలకం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Emphasizes Digital Safety at Google Center Launch: For Telugu News and English News kinldy scrolldown

జీవితం అంతా డిజిటల్‌తో ముడి… డిజిటల్ సేఫ్టీ కీలకం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Full Report in Telugu

హైదరాబాద్, జూన్ 18: గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం గూగుల్ ఆవిర్భావంతో మారిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు జీవితం అంతా డిజిటల్ ఆధారంగా సాగుతోందని, అందుకే డిజిటల్ సేఫ్టీ అన్నది అత్యంత కీలకమైన అంశంగా ఉద్ఘాటించారు.

మా ప్రభుత్వం ఇన్నోవేటివ్ అని, స్కిల్ల్స్ అభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని వివరించారు. హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలకు మొదటి ఎంపికగా నిలుస్తోందని, 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.

దేశ GDPలో తెలంగాణ వాటా 5 శాతమని, మహిళలు కోటీశ్వరులుగా మారేందుకు ప్రత్యేక కార్యక్రమాలను తీసుకొచ్చామని, ఈ లక్ష్య సాధనకు గూగుల్ తో భాగస్వామ్యం కొనసాగిస్తామన్నారు. జీఎస్‌ఈసీ హైదరాబాద్‌ ఏర్పాటు తెలంగాణకు గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

“తెలంగాణ రైజింగ్” లో భాగంగా కోటి మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తామని, ధీమాగా తెలిపారు. మహిళలు పెట్టుబడిదారులుగా ప్రపంచ వేదికపై నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *