
అర్చకుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ
TUDA చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినతిపత్రంతో సీఎంను కలిసి వివరాలు వెల్లడింపు
During his Tirupati visit, Chief Minister Chandrababu Naidu received a detailed briefing from TUDA Chairman Dollars Divakar Reddy regarding the contract archakas’ concerns. Responding positively, the CM assured prompt resolution of the issues.
తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తిరుపతి విమానాశ్రయంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అర్చకుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్చకుల తరఫున ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని సానుకూలంగా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సమస్యలు వివరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు.