
రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్
రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇంటర్ నెట్ లో వెదికి మరీ కాళేశ్వరం అక్రమాల (గురించి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు. బనకచర్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలియజేశారు. అవసరమైతే కేంద్రం తమ ఆలోచనలు పరిగణలోకి తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.