శ్రీశైలంలో రెండోరోజూ కొనసాగుతున్న సిడబ్ల్యూసి శాస్త్రవేత్తల సర్వే
శ్రీశైలం, జూన్ 4:
శ్రీశైలం జలాశయంపై రెండు రోజుల పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) శాస్త్రవేత్తల బృందం అధ్యయనం కొనసాగిస్తోంది. నేడు రెండోరోజుగా ఫీల్డ్లో ఉన్న ఈ నిపుణుల బృందం, జలాశయంపై బాథిమెట్రిక్ సర్వేను చేపట్టనుంది.
ప్రత్యేకంగా ఫన్జ్ పూల్ లోతు, విస్తీర్ణం అంశాలపై అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా పూర్తి స్థాయి విశ్లేషణ చేపట్టనున్నారు. ఈ అధ్యయనం ఆధారంగా జలాశయ భద్రత, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.