శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు తగ్గుముఖం
విద్యుత్ ఉత్పత్తి నిలిచిన పరిస్థితిశ్రీశైలం జలాశయం వరదనీరు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లో కేవలం 4,496 క్యూసెక్కులు మాత్రమే నమోదు కాగా, ఔట్ఫ్లో పూర్తిగా నిల్గా ఉంది.
ప్రస్తుతం నీటిమట్టం 832 అడుగులుగా ఉండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. మొత్తం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి మట్టం 51.50 టీఎంసీలు.
ఇతర రాష్ట్రాలకు సాగునీరు సరఫరా లేకుండా, ప్రాజెక్టులోని ఎడమ-కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.