
సాహిత్య డిగ్రీ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమం యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం — ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భూమిరెడ్డి రవి కళ్యాణ్ మైదుకూరు (బ్రహ్మంగారిమఠం ) మైదుకూరు నియోజకవర్గం లోని కాజీపేట మండలం సాహిత్య డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సాయిరాం రెడ్డి, ప్రిన్సిపల్ సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజేష్, భూమిరెడ్డి రవి కళ్యాణ్, సుధాకర్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భూమి రెడ్డి రవికళ్యాణ్ మాట్లాడుతూ యోగ అంటే వ్యాయామాల సాధనల సమూహార ఆధ్యాత్మిక రూపం ఆధ్యాత్మిక సాధనాలలో ఒక భాగం మోక్ష సాధనలో భాగమై ధ్యానం అంతర దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనాలకు పునాది అని ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనాలకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని హఠాయోగములో భాగమై ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహదారుధ్యాన్ని ముఖ వర్చస్సును విడుమడింప చేస్తుంది. యోగా పరగడుపున చేస్తే బాగుంటుంది అంటే లేవగానే ఉదయము 5 లేదా 6 ఇంటికి మిగతా సమయంలో చేసిన కనీసం గంట ముందు దాకా ఏమి తినకూడదు చేసిన తర్వాత కూడా అంత సమయం ఏమీ తినకూడదు భౌతిక వ్యాయామము లాగా డబ్బులు కట్టి పెట్రోల్ తో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే చలి అయిన ఎండైనా వర్షం అయినా ఆచరించవచ్చు అన్ని రకాల వ్యాధులకు అధిక బరువుకు మానసిక బలమునకు అవసరమైన ముందు జాగ్రత్త యోగ ఆసనం యోగ ద్వారా ప్రతి వ్యక్తులు సృజనాత్మకత నైపుణ్యత పెంపొందించుకోవచ్చునని అనారోగ్యాన్ని దూరం చేసే శక్తి యోగాకు మాత్రమే ఉందని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే నిరంతర యోగ వ్యాయామం తప్పనిసరి అని మానసిక రోగాలు ఒత్తిడి టాబ్లెట్లు మందులతో నయం కానీ దీర్ఘ కాలిక రోగాలు యోగ ఆసనాలు వ్యాయామం ద్వారా త్వరగా నయమవుతున్నాయని తెలిపారు. జూన్ 21 జరగబోయే ప్రపంచ యోగ దినోత్సవం రోజున యోగ కార్యక్రమ ప్రదర్శన ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం నవీన్ తదితరులు పాల్గొన్నారు.