
‘సయారా’ చిత్రం నుంచి తృతీయ గీతం ‘తుమ్ హో తో’ విడుదల
హైదరాబాద్:
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో, మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘సయారా’ మ్యూజిక్ ఆల్బమ్ మరొక బ్లాక్బస్టర్ ట్రాక్ను రిలీజ్ చేసింది. జూన్ 17న విడుదలైన “తుమ్ హో తో” పాటను ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ విశాల్ మిశ్రా ఆలపించాడు.
ఈ సందర్భంగా దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ — “నా పాటలే విశాల్ను సంగీత ప్రపంచంలోకి తీసుకువచ్చాయని తెలిసి గర్వంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత అతనితో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి” అని అన్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ ట్రాక్, ‘బర్బాద్’ పాటలకు విశేష ఆదరణ లభించగా, తాజా పాట కూడా రొమాన్స్తో పాటు మ్యూజికల్ డిప్త్తో ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే హీరోగా పరిచయం అవుతుండగా, అనీత్ పద్దా కథానాయిక. సయారా సినిమా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.