ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి కె. సంతోష రావు

శ్రీసిటీకి మెరుగైన విద్యుత్ సరఫరా
ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి కె. సంతోష రావు
తిరుపతి,
సత్యవేడు సెజ్ పరిధిలోని శ్రీసిటీకి మెరుగైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని
ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు తెలిపారు. శ్రీసిటీలోని విద్యుత్ విభాగపు అధికారులతో ఎసీఎస్పిడిసిఎల్ సిఎండి కె. సంతోష రావు శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్ సరఫరాను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. శ్రీసిటీలో నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం బ్రేకర్స్ నిర్వహణా పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. విద్యుత్ అంతరాయాలను నిరోధించేందుకు వీలుగా కొత్త రిలేస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక పరిశ్రమ పరిధిలో అంతర్గత విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకున్నట్లయితే అంతరాయాలను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు అవకాశం వుంటుందన్నారు. అంతర్గత విద్యుత్ సమస్యల అంశాన్ని ఎపిఎస్పిడిసిఎల్ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం ద్వారా సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్పిడిసిఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ డిఎస్ వరకుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సురేంద్ర నాయుడు, డివిజనల్ ఇంజనీర్లు ఎన్. దేవాశీర్వాదం, పి. రవికుమార్, ఎపిట్రాన్స్కో డైరెక్టర్ జెవి రావు, చీఫ్ ఇంజనీర్ డివి కిషోర్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కరుణాకర్, శ్రీసిటీ జనరల్ మేనేజర్ డి. నరసింహరెడ్డి. శ్రీసిటీ విద్యుత్ విభాగపు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.