
వైమానిక దళం లో ఉద్యోగాలు పొందాలి
రాయచోటి,
భారత వైమానిక దళంలో యువకులు ఉద్యోగాలు పొందాలని భారత వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు సందీప్ కుమార్, సురేంద్ర సింగ్ లు సూచించారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల భారత వైమానిక దళం ఉద్యోగావకాశాలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నుండి వచ్చిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్స్ శ్రీ ఎన్. సందీప్ కుమార్ మరియు శ్రీ సురేంద్ర సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వైద్య, శారీరక అర్హతలతో పాటు ప్రవేశ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అవకాశాలు పొందవచ్చని వారు వివరించారు.ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కంబైన్డ్ డిఫెన్సె స్కీమ్ మరియు యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ వంటి ఎంట్రీల ద్వారా బీటెక్ విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయని తెలియజేశారు.ఇంజనీరింగ్ బ్రాంచ్ లోని ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై వివరాలు అందజేశారు. కనీసం 60% మార్కులతో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక అనంతరం ఫిజికల్, మెడికల్ టెస్టులు, ఇంటర్వ్యూలు కూడా విజయవంతంగా పూర్తి చేయవలసి ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ,భారత రక్షణ రంగంలో సేవ చేయడం ప్రతి విద్యార్థికి గర్వకారణంగా ఉంటుంది. మన విద్యార్థులు ఇటువంటి అవకాశాలను వినియోగించుకొని దేశ సేవలో భాగస్వాములవ్వాలి” అని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. బాలాజీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. వెంకటరమణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కొత్తపల్లి ఇంతియాజ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.