
యోగాతో ఒత్తిడి నందికొట్కూరు యోగాతో మానసిక ఆరోగ్యం సాధ్యమని సచివాలయం సిబ్బంది. అశోక్ మరియు లోకేష్ అన్నారు. నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూర్ మేజర్ పంచాయతీ పరిధిలో పొదుపు మహిళసంఘాలను భాగస్వాములను చేసి వారితో యోగాసనాలు చేయించారు. అనంతరం మహిళా సంఘాలతోమాట్లాడుతూ ఎనిమిది అంగాలు కలిగిన యోగ సాధానాను అష్టాంగ యోగం అంటారు. వాటిలో మొదటి ఐదు బహిరంగ సాధనాలని, మిగిలిన మూడు అంతరoగ సాధానాలని పేర్కొంటారు. యమ నియమాలు సాధకులకు నైతిక క్రమశిక్షణ చేకూర్చితే ఆసన్న ప్రాణాయామాలు సాధకుల శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆసనం అంటే శరీరాన్ని ఒకే స్థితిలో నిశ్చలంగా వంచగలగడం. ప్రాణామయ సాధన అంటే మనం పిలిచే ప్రాణవాయువులను వివిధ విధాలుగా బిగబట్టి, వదులుతూ చేసే ఆయామం ప్రత్యహారం, అంటే సాధకుల తమ పంచేంద్రియాలను మనసును విషయ వాంఛలకు దూరంగా ఉంచడం. మనసును నిరంతరం ఒకే విషయం మీద లగ్నం చేయడాన్ని ధ్యానం అని పిలుస్తారు. ఈ సందర్భంగా యోగాతో కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది లోకేష్, అశోక్, పొదుపు మహిళ సంఘాల బుక్ కీపర్ కే.శంకరాచారి. మరియు తదితరులు పాల్గొన్నారు.