
యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్
విశాఖపట్నం
విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్య క్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్ రోడ్లో 26 కి.మీ. మేర యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా.. 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 45 నిమిషాల పాటు సీఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ సహా రాష్ట్ర, కేంద్ర మంతులు యోగాసనాలు చేశారు.