
భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల/
:రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.శుక్రవారం మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసే పరిష్కరించాలని అన్నారు. వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని, భూ భారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.ఆంతకుముందు
మేడిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సంధర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు పాఠ్యాంశం బోధన
(ఐఎఫ్టీ) ఇంటర్ యాక్ట్ ప్లాంట్ ప్యానల్ ద్వారా విద్యార్థులకు బోధించేటప్పుడు తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని జిల్లా కలెక్టర్ విద్యా బోధన ను గమనించారు .
పాఠశాల విషయాల గురించి విద్యార్థులను, ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకున్నారు.
వంటగది సామాగ్రి పప్పు దినుసులు వంట నూనె సంబంధించినవి నాణ్యత పరిమాణాలతో ఉండాలని, పిల్లలకు మంచి భోజనం అందించాలి సూచించారు.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు నిలువ ఉండకుండా చూడాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఈవో రామ్, కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి,తహసిల్దార్ మునీందర్,ఎంపీడీవో పద్మావతి,సంబంధిత అధికారులు, రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.