
ఫార్మా పరిశ్రమలో గ్యాస్ లీక్.
ఇద్దరు మృతి
ఒకరి పరిస్థితి విషమం
పరవాడ
పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం సాయి శ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీకై ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు గతంలో కూడా ప్రమాదం జరిగిందని భద్రతా ప్రమాణాలు వైఫల్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని గని శెట్టి అన్నారు. మృతులు పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ ) , సరగడం కుమార్. బైడు బైసల్ అనే వ్యక్తి చికిత్సల పొందుతున్నాడు.
మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు.