
పిల్లలతో సహ ఓ మహిళ ఆత్మహత్యయత్నం కాపాడిన సిద్దిపేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ సన్మానించి నగదు పురస్కారం అందజేసిన పోలీస్ కమిషనర్ సిద్దిపేట కుటుంబ కలహాల నేపధ్యంలో ఒక మహిళ పిల్లలతో సహ ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన సిద్దిపేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ సదరు మహిళతో మాట్లాడి కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు కమిషనర్ డా అనురాధ రవిందర్ ను సన్మానించి నగదు పురస్కారం అందచేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. విధులు నిర్వహించే సమయంలో మన చుట్టూ పరిసర ప్రాంతాలలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలని సూచించారు. బుధవారం నాడు సిద్దిపేటలోని కోటిలింగాల దేవాలయం ప్రాంతంలో నివాసం ఉండే చిట్టాపురం శ్యామల కుటుంబ కలహాలతో పిల్లలను తీసుకుని ఇంటి నుండి వెళ్ళింది. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న శ్యామల సిద్ది పేటలోని పాత బస్టాండ్ వద్ద తిరుగు తుండగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ గమనించారు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు కనుక్కున్నారు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కౌన్సిలింగ్ నిర్వహించారు. శ్యామల భర్త ఫోన్ నెంబర్ ఇస్తే పిలిపించి అతనికి అప్పగిస్తామని చెప్పారు. తన భర్త వద్దకు వెళ్లడానికి శ్యామల నిరాకరించింది. దీంతో సిద్దిపేట సఖి సెంటర్ వారికి ఫోన్ చేసి వారికి శ్యామలతో పాటు ఆమె పిల్లలు అప్పగించి కౌన్సిలింగ్ ఇప్పించి వారు ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా కాపాడినందుకు అభినందించి సన్మానించి నగదు పురస్కారం అందజేయడం జరిగిందని తెలిపారు. విధి నిర్వహణ అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.