
నెల్లూరు జిల్లాలో జంట హత్యలు
నెల్లూరు
నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపింది. మద్యం మత్తులో భార్య వెంకాయమ్మపై కత్తితో భర్త వెంగయ్య విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అత్త జయమ్మ (60), మామ కల్లయ్య (65) లను కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.