
దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను సోమవారం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానం నిలిచింది. ఉత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్సీ బెంగళూరు నిలిచింది. వివిధ రంగాల్లోని విద్యాసంస్థల ర్యాంకులను విద్యాశాఖ వెల్లడించింది.