
నెల్లూరు:
ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ వీఆర్ మున్సిపల్ హైస్కూల్ను నెల్లూరు నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబడి, దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచే స్థాయిలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
1875లో నెల్లూరు నగరం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఈ పాఠశాల ఎన్నో తరాల విద్యార్థులకు నాళా-నూలుగా మారింది. ప్రముఖులు విద్యను అభ్యసించిన ఈ పాఠశాల గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం కారణంగా మూతపడింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ పాఠశాలలో చదువుకున్న అనుభవంతో పాటు బాధ్యతను తీసుకుని దానిని పునర్నిర్మించారు.
రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఈ పాఠశాలను నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి. షరణి పాల్గొన్నారు.
అలాగే డీఎస్ఆర్ గ్రూప్స్ నిధులతో మూలాపేటలో బాలికల పాఠశాలకు, వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్ఎ్సఆర్ మున్సిపల్ హైస్కూల్కు మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నారా లోకేష్కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు.