CM Revanth Reddy met the national leadership in New Delhi to discuss Telangana’s development roadmap.

తెలంగాణ అభివృద్ధి పథాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు.
సమావేశంలో ప్రధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ మరియు దాని వ్యూహాత్మక రోడ్మ్యాప్పై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎన్నికల హామీల అమలు, కీలక విధాన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు చేరువయ్యే పథకాల అమలు తదితర అంశాలను అధిష్ఠానానికి వివరించారు.
సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వ కట్టుబాటును సీఎం పునరుద్ఘాటించారు. డిసెంబర్ 2023లో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం చేపట్టిన చర్యలను నాయకత్వానికి వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజా మద్దతును కూడా ప్రస్తావించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వం తెలంగాణ సమగ్ర, సమాన అవకాశాల అభివృద్ధికి మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు.
In the meeting, the delegation discussed the ‘Telangana Rising 2047’ vision and its strategic roadmap in detail. The Chief Minister briefed the leadership on key priorities, implementation of promises, policy decisions, development progress and outreach programmes.
He reiterated the government’s commitment to social justice and inclusive growth. Steps taken for the empowerment of women, farmers and youth since December 2023 were also explained. The leadership’s guidance, he said, would further strengthen Telangana’s path towards balanced and equitable development.