
టక్కోలు గ్రామంలో ఘనంగా యోగ దినోత్సవం
సిద్దవటం
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.టీడీపీ పార్ల మెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి, స్థానిక సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డిరు మాట్లాడుతూ యోగ మన ప్రాచీన సంపద. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి ఒక్కరు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టిలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యోగకు ప్రత్యేక స్థానం ఉంది,” అని పేర్కొన్నారు. ఇతరులతో కలిసి యోగ చేయడానికి వచ్చిన గ్రామ ప్రజలకు ఆయన స్వయంగా అల్పాహారం అందజేశారు. గ్రామస్థులు, యువత ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించి, యోగాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని సంకల్పించుకున్నారు.