
చెరువులోకి దూసుకెళ్లిన సుమో …
ఒకరు మృతి….ముగ్గురికి గాయాలు
తిరుపతి
తిరుపతి – పీలేరు మార్గంలోని చిన్న గొట్టిగల్లు సమీపం లోని చెరువులోకి సుమో వాహనం దూసుకుపోయింది. ప్రమాద ఘటనలో కలికిరికి చెందిన రవికుమార్ (40) మృతి చెందాడు. చిన్న గొట్టిగల్లు మండలం, మారసానివారి పల్లికి చెందిన శంకరయ్య, ,ప్రకాష్ , భాకరాపేటకు చెందిన రఘునాథ్ కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న భాకరాపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భాకరాపేట ఎస్సై రాఘవేంద్ర క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.