
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
ఆస్త్మా నివారణకు ప్రసిద్ధమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఇది రేపటితో ముగియనుంది. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వేలాది మంది భక్తులు ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. భద్రత, వైద్య సహాయాన్ని ప్రభుత్వ యంత్రాంగం సమకూర్చింది.