
కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్ సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన
కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల,
పట్టణంలోని కల్లూర్ రోడ్డు లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పట్టణ, మండలానికి సంబంధించిన 1 కోటి 7 లక్షల 12 వేల 412 రూపాయల విలువ గల 107 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,
స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.. అలాగే పట్టణ, మండలానికి చెందిన 10 లక్షల 54 వేల రూపాయల విలువగల 37 ముఖ్యమంత్రి సహా నిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి దురద అరాచకాల వల్ల రాష్ట్రంలో ఆదాయం తగ్గిందన్నారు.. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు నెలకు 4వేల కోట్ల ఉన్న ఆదాయాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ అట్టి ఆదాయాన్ని 18 వేల కోట్లకు వచ్చిందని మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆదాయం తగ్గిందని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలన్నీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టినవేమన్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమన్నారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటీ వెంకట్రావు, నాయకులు ఫహీం,హఫీజ్, భాస్కర్ రెడ్డి, ఖయ్యుం, అంజయ్య, సందయ్య, నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిది లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు