
ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్
హైదరాబాద్
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల కౌంట్డౌన్ అట్టహాసంగా ప్రారంభమైయింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వాసులు హజరయక్యారు. ఎల్బీ స్టేడియం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెలుగులీనుతోంది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్నతలు తెలియజేస్తున్నామని అన్నారు.
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలి. ఈరోజు యోగా 24 గంటల కౌంట్ డౌన్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకుంటున్నాం.
రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడం సంతోషకరం. తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయమని అన్నారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది. యోగానే మనకు ప్రథమ డాక్టర్. యోగా సర్వరోగ నివారిణి. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుతున్నానని అన్నారు.