ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతపై బెదిరింపులు – షాపింగ్ కాంప్లెక్స్‌పై అక్రమ కబ్జా ఆరోపణలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేతపై బెదిరింపులు – షాపింగ్ కాంప్లెక్స్‌పై అక్రమ కబ్జా ఆరోపణలు

చిలకలూరిపేటకు చెందిన ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యుడు రావి మురళీ మోహన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడి అనుచరులు తనకు స్వంతమైన షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆక్రమించడమే కాకుండా, “అక్కడికి వస్తే నిన్నే చంపేస్తాం” అంటూ బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “కోర్టు ఆదేశాలతో నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, అవే పగలగొట్టారు. నాకు విదేశాల్లో జీవితానుభవం ఉన్నా, స్వదేశంలోనే న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది,” అన్నారు రావి మురళీ మోహన్.

ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించాలని, తన భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *