
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.
ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి మున్సిపాలిటీ మరియు వనపర్తి మండలం లబ్ధిదారులకు పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.*_
ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.
గత పాలకులు పేద ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఈ ప్రజా పాలనలో పేద ప్రజల సమస్యలే పరిష్కారం దిశగా ముందుకు వెళుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు ఇల్లా పట్టాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇల్లు నిర్మించిన అనంతరం ఇందిరమ్మ ఇళ్లలోనే మీ ఆహ్వానం మేరకు మన ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో మీ ఇంట్లోనే భోజనం చేసి వస్తానని హామీ ఇచ్చారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని పేద ప్రజలను మోసం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇల్లు లేని ప్రతి బీద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.