
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది: తంబి దురై
తిరుపతి,
పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై రాజ్యసభ అధ్యయన బృందం చురుకైన సమీక్ష చేపట్టిందని బృంద చైర్మన్ డాక్టర్ ఎం తంబి దురై తెలిపారు. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
తిరుపతిలో తాజ్ హోటల్లో రోడ్లు, పర్యాటకం, పౌరవిమాన యానం, బ్యాంకింగ్ తదితర రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరిత పరిష్కారానికి కేంద్రానికి నివేదిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు.
జాతీయ రహదారుల విస్తరణతోపాటు ముంబై-చెన్నై శాటిలైట్ రహదారి ద్వారా ఏపీకి అభివృద్ధి వేదిక సిద్ధమవుతుందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు రాజ్యసభ సభ్యులు, కేంద్ర-రాష్ట్ర అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.