అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్
కాంగ్రెస్ పార్టీతో పాటు గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

శామీర్ పేట గరుడ వార్త : అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఏజెండా అని అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ లు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు అలియాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అలియాబాద్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నీరుడి బాలేష్, కనకల కాళిదాస్, కనకల సుధాకర్, తడెం ఎల్లం, బత్తుల ప్రవీణ్ కుమార్, బొమ్మర్ల అనిల్ కుమార్, భరత్, కనకల మల్లేష్, పల్లె ప్రకాష్, మేడిపల్లి ప్రకాష్, ఎన్ వరప్రసాద్, ఏ వేణు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ మాజీ ఎంపీటీసీ ఇప్ప మంజుల మాధవరెడ్డి, మెడి మల్లేష్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కమటం శ్రీనివాస్,